Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
ఈ వారం థియేటర్లలో విడుదలైన "మరీచిక" మూవీ ప్రేక్షకుల నుండి బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. సరైన కథా కథనాలు లేకపోవడంతో మూవీ ఆర్టిస్ట్ లు కూడా బాగానే చేసినా, ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నా, ఫలితం లేకపోయింది. దర్శకుడు సతీష్ కాసెట్టి సరైన స్క్రీన్ ప్లే రాసుకోవడంలో విఫలమయ్యారు.
ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ ‘మరీచిక’ చిత్రం మంచి పొటెన్షియల్ ఉన్న కథను తెరపై ఆవిష్కరించడంలో విఫలమై డిజప్పాయింట్ చేసే సైకలాజికల్ థ్రిల్లర్గా మిగిలిపోయింది. ఎంగేజింగ్ గా మార్చే స్కోప్ ఉన్నప్పటికీ స్లోగా సాగే డిజైన్ చేసుకున్న కథనం నిరాశ పరుస్తుంది. ఫైనల్ గా కథనంలో బలహీనత కారణంగా మరీచిక చిత్రం ప్రభావం చూపలేని బోరింగ్ థ్రిల్లర్ గా నిలిచిపోయింది.
దృశ్యం సినిమాలకు ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే విడుదలైన రెండు సినిమాలు అన్ని భాషల్లో పెద్ద హిట్ అయ్యాయి. దీనికి మూలం మలయాళం. అక్కడ మోహన్లాల్, మీనానటించగా, ఇందులో భాగంగా ఇప్పుడు మలయాళంలో మూడో సీక్వెల్ వచ్చింది. అయితే గత రెండు చిత్రాల మంచి ఆదరణ పొందాయి. ఇప్పుడు మూడో పార్ట్ కూడా అదే తరహాలో ఎంగేజ్ చేసిందా? ట్విస్ట్ లు, టర్న్ లతో సాగిందా? అవి ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాయా? అంటే ఆ స్థాయిలో లేదనే చెప్పాలి.
సినిమా ప్రారంభం నుంచి చాలా స్లోగా సాగుతుంది. కథ ముందే తెలియడంతో ఇందులో కథనం ఊహించినట్టుగానే ఉంటుంది. దీనికితోడు కథలో ఇంటెన్సిటీ మూడ్ ని క్రియేట్ చేయడానికి దర్శకుడు చాలా టైమ్ తీసుకున్నారు. దీంతో బోరింగ్ గా ఉంటుంది. మధ్య మధ్యలో థ్రిల్ ఎలిమెంట్లు ఒకటి రెండు యాడ్ చేశారు. కానీ అవి పెద్దగా కిక్ ఇవ్వవు. నటీనటుల పెర్ఫార్మన్స్ వరకు మోహన్ లాల్ సహా అందరూ బానే చేసారు. కానీ ఆ పాత్రలకు కనెక్ట్ అవ్వాలంటే కొంచెం కష్టమే. ఓవరాల్ గా స్లోగా, బోరింగ్ గా సాగే ఈ దృశ్యం 3 మూవీ, మధ్య మధ్యలో చిన్న మెరుపులు, క్లైమాక్స్ తో కాస్త ఆకట్టుకుంటుంది. అయితే గత రెండు సినిమాలతో పోల్చితే డిజప్పాయింట్ చేస్తుంది.
మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం "దృశ్యం 3". జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 'దృశ్యం' మూవీ ఫ్రాంచైజీలో మూడో పార్ట్ గా వచ్చింది. ఈ ఫ్రాంచైజీకి ఉన్న పాపులారిటీ వల్ల ఈసారి తెలుగు రీమేక్ హక్కులు అమ్మకుండా మలయాళంతో పాటు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేసారు. అయితే ఈ మూడో పార్ట్ మాత్రం అంతగా రెస్పాన్స్ అందుకోలేకపోయింది. అసలు దృశ్యం అంటేనే అద్భుతమైన స్క్రీన్ ప్లే, ఊహించని ట్విస్టులు గుర్తుకొస్తాయి. కానీ దృశ్యం 3 మాత్రం ఆ స్థాయి మాయాజాలాన్ని పూర్తిగా అందుకోలేకపోయింది.
జీతు జోసెఫ్ పేరు వినగానే ప్రేక్షకులు పెద్ద ట్విస్టులు, తెలివైన కథనాన్ని ఆశిస్తారు. కానీ ఈసారి ఆయన కథను చాలా సాధారణంగా చెప్పిన భావన కలుగుతుంది. గత రెండు భాగాలతో పోలిస్తే ఈ సినిమాలో కొత్తదనం తక్కువగా కనిపిస్తుంది. ఇక గ్రామీణ వాతావరణాన్నయితే సహజంగా చూపించారు. అయితే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కట్టుదిట్టంగా ఉండాల్సింది. మొదటి భాగంలో అనవసరంగా సాగదీసిన సన్నివేశాలు తగ్గించి ఉంటే సినిమా మరింత ప్రభావవంతంగా ఉండేది. ఓవరాల్ గా దృశ్యం 3 మూవీని తక్కువ అంచనాలతో చూస్తే బెటర్.
దృశ్యం’ అనే పేరు వినగానే ఆడియన్స్కు ముందుగా గుర్తొచ్చేది mind game screenplay. ఫ్యామిలీ ఎమోషన్స్తో crime thrillerని mix చేసి ప్రేక్షకులని సీట్ల ఎడ్జ్ మీద కూర్చోబెట్టిన ఫ్రాంచైజ్ ఇది. ఇందులో భాగంగా తాజాగా ‘దృశ్యం-3’ విడుదల కాగా, మలయాళ డబ్ నే తెలుగులోనూ రిలీజ్ చేసారు. కథా, కథనాల గురించి మాట్లాడితే ముందు భాగాల్లో ఉన్న ఆత్రుత, ఇంట్రెస్ట్ ఈ మూడో భాగంలో ఉండదు. మోహన్ లాల్ సహా మిగతా నటీనటులందరూ బాగానే చేసినా, కథలో మాత్రం ఒక wow factor కనిపించదు.
ఫస్టాఫ్ అంతా స్లో గా సాగదీసినట్టు ఉండడమే కాకుండా, ట్విస్టులు కూడా పెద్దగా షాక్ ఇవ్వవు. పైగా తెలుగు డబ్బింగ్ మేజర్ మైనస్ అయింది. డబ్బింగ్ సినిమాటిక్ గా, సహజంగా ఉండదు. ఓవరాల్ గా సినిమాలో క్లైమాక్స్ 20 నిముషాలు మినహా మొత్తం సినిమా డల్ గా ఉంటుంది. బీజీఎమ్ కూడా పెద్దగా హెల్ప్ అవలేదు. ఓవరాల్ గా దృశ్యం 3 గురించి సింపుల్ గా చెప్పాలంటే... లౌ ఎక్స్పెక్టేషన్స్ తో ఒకసారి చూసేయొచ్చు. కానీ ఇప్పటికైనా దృశ్యం సిరీస్ గౌరవాన్ని కాపాడుతూ.. ఈ సిరీస్ ఇక్కడితో ఆపేస్తే బెటర్. మొదటి రెండు భాగాలతో పోలిస్తే దృశ్యం 3 మసకబారింది.
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన 'దృశ్యం', 'దృశ్యం 2' ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఆ రెండూ మలయాళంలో మోహన్ లాల్ (Mohanlal) హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు రీమేక్స్. అయితే 'దృశ్యం' ఫ్రాంచైజీలో మూడో సినిమాను రీమేక్ చేయలేదు. తాజాగా తెలుగులోనూ మోహన్ లాల్ సినిమాను డబ్బింగ్ చేసి దృశ్యం 3 ని విడుదల చేశారు. సినిమా ఎలా ఉందనేది పక్కన పెడితే... తెలుగు ప్రేక్షకులకు ఎదురయ్యే మొదటి సమస్య ఒరిజినల్ వెర్షన్ లో , ప్రధాన పాత్రధారులను తొందరగా పోల్చుకోకపోవడం.
అందువల్ల కొంతమంది తెలుగు ఆడియన్స్ మూవీకి కనెక్ట్ కాకపోవచ్చు. ఇక 'దృశ్యం', 'దృశ్యం 2' సినిమాల్లో కథతో పాటు కథనం కూడా ఉత్కంఠ కలిగిస్తుంది. ట్విస్టులు సర్ప్రైజ్ చేయడంతో పాటు షాక్ ఇస్తాయి. పోలీస్ స్టేషన్ కింద దొరికిన అస్థిపంజరం వరుణ్ ది కాదని కోర్టులో తెలిసే సీన్, లాయర్ ఎక్స్ప్రెషన్ ఇప్పటికీ వైరల్ అవుతుంది. కానీ 'దృశ్యం 3'లో అటువంటి సన్నివేశం ఒక్కటి కూడా లేదు. ఆ సంగతి పక్కన పెడితే... 'దృశ్యం' ఫ్రాంచైజీలో మొదటి రెండు సినిమాల్లో సగం ఉత్కంఠ కూడా మూడో భాగం ఇవ్వలేదు. అందుకే ముందు భాగాల్లాగా దృశ్యం 3కి థియేటర్లలో థ్రిల్ అవ్వడం చాలా కష్టం. మోహన్ లాల్ వీరాభిమానులను సైతం దృశ్యం 3 మెప్పించడం కష్టమే అనిపిస్తుంది.
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే అందులో ‘దృశ్యం’ కచ్చితంగా ఉంటుంది. దానికి కొనసాగింపుగా వచ్చిన ‘దృశ్యం-2’ సైతం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో మూడో సినిమా తెలుగు మలయాళ భాషలలో విడుదలైంది. మలయాళం వెర్షన్ నే తెలుగులోనూ రిలీజ్ చేయగా, మోహన్ లాల్, మీనా మెయిన్ లీడ్ గా నటించారు. అయితే తెరపై జీతు-మోహన్ లాల్ కలిసి మరోసారి ఏదో మ్యాజిక్ చేసే ఉంటారని ఎంతో నమ్మకంతో థియేటర్లలో అడుగు పెట్టిన ప్రేక్షకులకు నిరాశ తప్పదు.
జార్జి కుట్టి క్యారెక్టర్.. ‘దృశ్యం’ ఫార్మాట్ బాగా అలవాటైపోయి ఉండడం వల్ల కొత్తదనం ఫీలవ్వలేని పరిస్థితి రావడం ‘దృశ్యం-3’కి అతి పెద్ద ప్రతికూలతగా మారింది. మోహన్ లాల్ మినహా వేరే క్యారెక్టర్లు పెద్దగా ఆకట్టుకోవు. పైగా తెలుగు డబ్బింగ్ బాగా చేయలేదు. డబ్బింగ్ వాసనలు గుప్పుమంటాయి. అన్నిటికి మించి తెలుగు ఆడియన్స్ వెంకటేష్ ప్లేస్ లో వేరే నటుడ్ని ఈజీగా కనెక్ట్ అవలేరు. జీతు జోసెఫ్ ఈసారి రచయితగా.. దర్శకుడిగా తన ప్రమాణాలను అందుకోలేకపోయాడు. దృశ్యం.. దృశ్యం-2 చిత్రాల్లో మైండ్ బ్లోయింగ్ రైటింగ్ తో కట్టిపడేసిన జీతు.. ఈసారి నిరాశపరిచాడు. ముఖ్యంగా ప్రేక్షకుల బుర్రలకు పని పెట్టేలా సాగే తన మార్కు స్క్రీన్ ప్లే ఇందులో మిస్ అయింది. దర్శకుడిగానూ జీతు పనితనానికి యావరేజ్ మార్కులే పడతాయి.
మోహన్ లాల్, మీనా (Meena) జంటగా నటించిన మలయాళ చిత్రం దృశ్యం రెండు భాగాలను తెలుగులో వెంకటేశ్ (Venkatesh), మీనా చేశారు. అక్కడ మాదిరిగానే ఇక్కడా 'దృశ్యం, దృశ్యం 2' హిట్ అయ్యాయి. అయితే ఈసారి మాత్రం 'దృశ్యం 3' (Drishyam 3)ని రీమేక్ చేయకుండా డబ్ చేసి తెలుగువారి ముందుకు తీసుకొచ్చారు. మోహన్ లాల్, మీనా మెయిన్ లీడ్ లో నటించిన ఈ మూవీ థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది.
అయితే మొదటి రెండు భాగాలతో పోల్చితే... 'దృశ్యం 3' పేలవంగా సాగింది. నటీనటుల విషయానికి వస్తే మోహన్ లాల్ తనదైన శైలిలో జార్జి కుట్టి పాత్రకు మరోసారి ప్రాణం పోశాడు. మిగిలిన నటీనటులు పర్వాలేదనిపించారు. దృశ్యం' సీరిస్కు దర్శకుడు జీతూ జోసెఫ్ స్క్రీన్ ప్లేనే ప్రధాన బలం. మొదటి రెండు భాగాల్లో అది వర్కౌట్ అయి, ఆ సినిమాల విజయానికి కారణమైంది. మూడో భాగం దగ్గరకు వచ్చే సరికీ నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా... స్క్రీన్ ప్లే ఉత్కంఠను కలిగించలేదు కదా, కథనం నత్తనడకలా సాగి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. థ్రిల్లర్ మూవీస్ను ఇష్టపడే వారికి ఓ మాదిరిగా అనిపించవచ్చు కానీ మిగిలిన వారిని 'దృశ్యం 3' ఆకట్టుకోవడం కష్టమే.
దృశ్యం ఫ్రాంచైజీకి మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో దృశ్యం 3 వస్తుందనే వార్తతో ఆడియెన్స్లో భారీగా క్యూరియాసిటీ పెరిగింది. అయితే ఆ క్యూరియాసిటీతో వెళ్లిన ప్రేక్షకులకు దర్శకుడు జీతూ జోసెఫ్ పూర్తి స్థాయిలో సంతృప్తిని కలిగించలేకపోయాడనే చెప్పాలి. కథలో కొత్తదనం లేకపోవడం, కథ కథనంలో వేగం లేకపోవడం వల్ల సహనానికి పరీక్ష పెట్టారా? అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక మోహన్ లాల్ ఈ సినిమాకు వెన్నముకగా నిలిచాడు. సినిమా ఆద్యంతం వన్ మ్యాన్ షో పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకొన్నాడు.
ఇక కేరళ అందాలను ఎప్పటిలానే సినిమాటోగ్రాఫర్ కెమెరాలో చక్కగా ఒడిసిపట్టుకొన్నారు. ఆశీర్వాద్ సినిమాస్, ఆంటోని పెరంబవూర్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ట్విస్టులతో సాగే థ్రిల్లర్ను ఇష్టపడే వారికి కూడా ఈ దృశ్యం 3 సినిమా నచ్చడానికి అవకాశాలు ఉన్నాయి.
మోహన్ లాల్ నటించిన దృశ్యం 3 సినిమా మళయాళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవగా, తెలుగులో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. తెలుగులో చేసిన వెంకటేష్ పాత్రలో మోహన్ లాల్ ని తొందరగా ఊహించుకోలేరు కాబట్టి, కొంతమంది కనెక్ట్ కాకపోవచ్చు. అలాగే ఫస్ట్ రెండు పార్ట్స్ స్థాయిలో మూడో పార్ట్ కి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు జీతూ జోసెఫ్ తడబడ్డాడు. అయితే నటీనటుల పెర్ఫార్మన్స్ పరంగా మోహన్ లాల్ సహా అందరూ బాగానే నటించారు.
ఇక ఓవరాల్ గా చూస్తే... ‘దృశ్యం 3’ ఈ ఫ్రాంచైజీ సెట్ చేసిన రేంజ్ లో అయితే అనిపించలేదు. అలా అని కాకుండా పార్ట్ 3 బానే ఉంది. కానీ సింపుల్ గా చెప్పాలంటే ఒకే రేంజ్ లో ఉంది. కానీ ఆడియన్స్ మాత్రం ముందు పార్ట్స్ ఇచ్చిన హై ని ఈ మూవీలో కూడా ఎక్స్పెక్ట్ చేస్తే నిరాశ చెందుతారు. ఓవరాల్ గా మోహన్ లాల్ పెర్ఫార్మన్స్ కోసం, మలయాళం మూవీస్ ఇష్టపడే ఆడియన్స్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి ఈ సినిమా ట్రై చేయొచ్చు. కానీ మరింత ఎంగేజింగ్ కథనం మిస్ కావడంతో ఇది మిస్ ఫైర్ అయ్యింది.
రిలీజ్ లాస్ట్ మినట్ లో ఫైనాన్స్ ఇబ్బందులను ఫేస్ చేసి షోలు కాన్సిల్ చేసుకుని ఒక రోజు ఆలస్యంగా ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో వచ్చేసిన కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన వీరభద్రుడు మూవీ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఓవరాల్ గా చాలా బేసిక్ పాయింట్ తో రూపొందిన వీరభద్రుడు సినిమా డైరెక్టర్ ఇది వరకే ప్రమోషన్స్ లో చెప్పినట్లు పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇష్టపడే ఆడియన్స్ కోసం తీసిన సినిమా ఇది.
ఫ్రెష్ స్టోరీలు ఎక్స్ పెర్ట్ చేసే ఆడియన్స్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ తప్ప కథ పెద్దగా ఇంప్రెస్ చేయకపోవచ్చు. కానీ కమర్షియల్ మూవీస్, మాస్ మూమెంట్స్, హీరో ఎలివేషన్ సీన్స్ లాంటివి ఎంజాయ్ చేసే ఆడియన్స్ కి మాత్రం బాగానే కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సినిమాలో ఈజీగా రీసెంట్ టైంలో వచ్చిన సూర్య మూవీస్ లో బెస్ట్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ ఇదే అని చెప్పొచ్చు. సూర్య తనదైన స్టైల్ లో యాక్టింగ్ అండ్ డైలాగ్స్ హీరో ఎలివేషన్స్ తో పాటు, తనదైన స్క్రీన్ ప్రజెన్స్ తో కుమ్మేశాడు. ఇక ఆర్ జే బాలాజీ విలన్ గా జస్ట్ ఓకే అనిపించగా, డైరెక్టర్ గా ఫ్యాన్స్ కోసం ఎక్స్ లెంట్ ఎలివేషన్స్ ను పెట్టినా, కథ పరంగా వీక్ పాయింట్ నే ఎంచుకున్నాడు. ఓవరాల్ గా వీరభద్రుడు బాగానే ఆకట్టుకోవచ్చు. అయితే కొంచం తమిళ్ ఫ్లేవర్ తగ్గించి కథ విషయంలో శ్రద్ధ పెట్టి ఉంటే పెర్ఫెక్ట్ కంబ్యాక్ మూవీ అయ్యేది. అయినా సినిమా ఒకసారి చూడొచ్చు.
గత కొంత కాలంగా తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపించటం లేదు. ఈ నేపథ్యంలో నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య నటించిన తాజా చిత్రం ‘వీరభద్రుడు’ (తమిళంలో ‘కరుప్పు’) శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. న్యాయవ్యవస్థలోని లోపాలను దైవాంశకు ముడిపెడుతూ కమర్షియల్ యాంగిల్ లో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి అనుకున్నంత రెస్పాన్స్ రాబట్టుకోలేకపోతుంది.
కథ పరంగా బాగానే ఉన్నప్పటికీ ఎన్నో వందల చిత్రాల్లో ఈ కాన్సెప్ట్ చూసే ఉంటారు ఆడియన్స్. రీసెంట్ గా గోపాల గోపాల, బ్రో వంటి చిత్రాల్లో కూడా ఈ నేపథ్యాన్ని వాడారు. దర్శకుడు బాలాజీ ఫ్యాన్స్ ని మెప్పించేలా సినిమా తెరకెక్కించాడు గాని, నార్మల్ ఆడియన్స్ కి చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ చూస్తున్న ప్రేక్షకులకు ‘కాంతారా’ లాంటి సినిమాలు గుర్తొస్తాయి. అయితే ఎలాంటి ఎమోషనల్ బాండింగ్ కి ఆడియన్స్ లోను కాకపోవడం వల్ల అంతగా ఆకట్టుకోదు. తొలి అర్ధభాగం చూసి పర్వాలేదని ఫీలయిన వారికి ద్వితీయార్ధంతో పెద్ద షాక్ ఇస్తాడు దర్శకుడు. సూర్య ఇలాంటి స్క్రిప్ట్ కు ఎందుకు ఓకె చెప్పాడా అనే సందేహం కలగక మానదు. ఏది ఏమైనా సూర్య అభిమానులు మరోసారి నిరాశకు గురికాక తప్పదు.
కోలీవుడ్ స్టార్ సూర్య 'కరుప్పు' ఫైనాన్షియల్ ఇష్యూల కారణంగా మే 14న విడుదల కాకపోగా, ఒక్క రోజు ఆలస్యంగా మే 15న థియేటర్లలోకి వచ్చింది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించడంతో పాటు విలన్ గా నటించగా, తెలుగులో 'వీరభద్రుడు' పేరిట విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే సినిమా కథ పరంగా అంతగా మెప్పించలేకపోయినా, కమర్షియాలిటీతో పాటు కామన్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే నార్మల్ కథ రాసుకున్నారు ఆర్జే బాలాజీ & టీమ్. అందులో సక్సెస్ అయ్యారు. అయితే... దర్శకుడిగా మాత్రం కథకు సరైన క్యాస్టింగ్ ఎంపిక చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు ఆర్జే బాలాజీ.
వీరభద్రుడు' కథకు వస్తే... దేవుడు వచ్చినా న్యాయవ్యవస్థను మార్చలేడని ఆర్జే బాలాజీ చెప్పాలనుకున్నారు. సినిమాలో సూర్య వీరభద్రుడిగా రుద్ర తాండవం చేశారు. అయితే... సూర్యను చూడాలని థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు ఆర్జే బాలాజీ ఎలివేషన్స్ & ఆయన స్క్రీన్ టైమ్ ఇబ్బంది పెడుతుంది. టెక్నికల్ గా మ్యూజిక్ ఫెయిల్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఫైనల్ గా ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే... ప్రేక్షకులకు 'వీరభద్రుడు' నచ్చుతాడు.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Homemaker / Housewives
Women managing households
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers